కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి తాటికొండ రాజయ్య సంపూర్ణ మద్దతు
హైదరాబాద్ః తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు . తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్లను మొన్న సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సిఎం కెసిఆర్ ఏకంగా 115 అసెంబ్లీ టికెట్లను ప్రకటించారు . అయితే.. ఈ లిస్ట్ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు గల్లంతు అయింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ను సిఎం కెసిఆర్ కడియం శ్రీహరికి ఇచ్చారు. గత కొన్ని రోజులుగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వస్తున్న ఆరోపణలు.. సర్పంచ్ నవ్య వివాదం తరుణంలోనే ఆయనకు టికెట్ ఇవ్వకుండా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ను కడియం శ్రీహరికి ఇచ్చారు. దీంతో.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. తాజగా కెటిఆర్ రంగంలోకి దిగడంతో కడియం శ్రీహరికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జై కొట్టారు.