విపత్కర సమయంలో కూడా పేదల ఆసరా పెన్షన్ల

harish rao
harish rao

సంగారెడ్డి: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి కలెక్టరేట్‌లో‌ కల్యాణ లక్ష్మి, షాదీ‌ముబారక్ చెక్ ల‌ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనాతో ఆదాయం తగ్గినా సిఎం కెసిఆర్‌ సంక్షేమ కార్యక్రమాలు ఆపడంలేదని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగడం లేదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,400 కోట్లు రైతుబంధు సాయం అందజేశామన్నారు. ఈ విపత్కర సమయంలో కూడా పేదల ఆసరా పెన్షన్ల కోసం వేయి కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/