తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స .. 18కి చేరిన ‘కరోనా’ కేసుల సంఖ్య

coronavirus
coronavirus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఈ వైరస్‌ విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే తెలంగాణాలో 16 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. వీరిద్దరూ లండన్‌ నుంచి వచ్చిన భారతీయులని, వీరికి వైరస్‌ పాజిటివ్‌ అని తేలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలెషన్‌లో ఉంచామని చెప్పారు. కాగా వీరితో కలిపి రాష్రంలో కరోనా కేసుల సంఖ్య 18కి చేరింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/