భారీ వర్షాలు..అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు
హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం రేపు (శుక్రవారం) కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద తీవ్రతపై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రతను ప్రగతి భవన్ నుంచి ఎప్పటికిప్పుడు సీఎం పర్యవేక్షిస్తున్నారు.