చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోతున్న గుండెలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో అభిమానుల గుండెలు ఆగిపోతున్నాయి. చంద్రబాబు ను అరెస్ట్ చేసారని తెలిసి ఆవేదనకు గురవుతూ…ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంతమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ రెండు రోజుల్లో దాదాపు 08 మంది మృతి చెందారు. తాజాగా మరొకరు కన్నుమూశారు.

వినుకొండ నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభిమాని బోయపాటి మణికంఠ మృతి చెందాడు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో గుండె పోటుతో మణికంఠ కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించే లోపు మణికంఠ మృతి చెందాడు. అలాగే తాడేపల్లి దళితవాడకు చెందిన టీడీపీ అభిమాని కొడాలి సుధాకర రావు(65) గుండెపోటు తో మరణించారు. సుధాకర్‌రావు మృతి వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.