భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 872 పాయింట్లు నష్టపోయి 58,773కి పడిపోయింది. నిఫ్టీ 267 పాయింట్లు పతనమై 17,490కి దిగజారింది. మార్కెట్లలో ఈరోజు అన్ని సూచీలు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయనికి రూ.79.86 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/