భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex start with gains
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 803 పాయింట్లు లాభపడి 64,718కి చేరుకుంది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 19,189కి ఎగబాకింది. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 64,768 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.04 వద్ద కొనసాగుతుంది.