విశాఖలో సోము వీర్రాజుకు చేదు అనుభవం

విశాఖలో సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన సోము వీర్రాజును లోపలికి వెళ్లకుండా గేట్ వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి చెప్పడంతో సిబ్బంది అనుమతించారు. తనను లోపలికి పంపించారా? అంటూ సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై సోము వీర్రాజు మండిపడ్డారు. దీంతో గేట్ వద్ద ఉన్న సిబ్బందికి తెలియదని అధికారులు సర్దిచెప్పారు.

విశాఖపట్నంలో కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కూడా కార్యక్రమానికి వెళ్లారు. అయితే ఆయనను లోపలకు పంపించకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనను లోపలకు పంపించరా? అంటూ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. దీన్ని గమనించిన కిషన్ రెడ్డి ఆయనను లోపలకు అనుమతించమని చెప్పడంలో వీర్రాజును లోపలకు పంపించారు. దీంతో సోము శాంతించారు.