తాను ఒంటరిని అయ్యానని వైఎస్ షర్మిల ట్వీట్ ..

గత కొద్దీ రోజులుగా షర్మిల – జగన్ మోహన్ రెడ్డి ల మధ్య మనస్పర్థలు వచ్చాయని..అందుకే షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టిందనే వార్తలు మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల ఫై ఎప్పుడు స్పష్టంగా క్లారిటీ ఇవ్వాలని షర్మిల..పరోక్షంగా మాత్రం జగన్ కు దూరమయ్యాయని చెప్పకనే చెపుతూ వస్తుంది. ఈరోజు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భాంగా వైస్ కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విజయమ్మ , జగన్ , షర్మిల తో పాటు కుటుంబ సభ్యులు , వైఎస్ అభిమానులు , రాజకీయ పార్టీ నేతలు ఇలా పలువురు హాజరయ్యారు. ఈ వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ’ అని షర్మిల ట్వీట్ చేశారు. అంటే.. తాను ఒంటరిని అయ్యానని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పినట్లు అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఒంటరి దానినైనా విజయం సాధించాలని,
అవమానాలెదురైనా ఎదురీదాలని,
కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని,
ఎప్పుడూ ప్రేమనే పంచాలని,
నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి
నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు.
నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.
ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.
I Love & Miss U DAD— YS Sharmila (@realyssharmila) September 2, 2021