దీప్తి సునయన బ్రేక్ అప్ ప్రకటన చూసి షణ్ముఖ్ రియాక్షన్ ఎలా ఉందంటే..

న్యూ ఇయర్ రోజు దీప్తి సునయన..అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. తాను షణ్ముఖ్ తో విడిపోతున్నాని తెలిపి నెటిజన్లకు. ఫాలోయర్స్ కు షాక్ గురిచేసింది. షణ్ముఖ్‌- దీప్తి సునయన అంటే తెలియని నెటిజన్లు లేరు. షార్ట్ మూవీస్ , టిక్ టాక్ వీడియోలతో యూత్ ను ఆకట్టుకున్న ఈ జంట..గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతారని అభిమానులు అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టాడు. యూట్యూబర్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న షణ్ముఖ్ ..బిగ్ బాస్ సీజన్ 5 లో ఛాన్స్ వచ్చింది. ఇతడు సీజన్ 5 లో ఉన్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఇతడే సీజన్ విన్నర్ అని అంత భావించారు. కానీ హౌస్ లోపలి వెళ్ళకగాని మనోడిలోని అసలైన వ్యక్తి బయటకొచ్చాడు.

హౌస్ సభ్యురాలు సిరి తో ఫ్రెండ్ షిప్ పేరుతో దగ్గరయ్యారు. బయటకు ఫ్రెండ్ షిప్ అని చెప్పి ఇద్దరు ఒకరికి ఒకరు బాగా దగ్గరయ్యారు. హగ్గులతో నిత్యం సిరి కౌగిలిలో బందీ అయ్యాడు. సిరి సైతం అంతకు ముందు శ్రీహన్ తో ప్రేమాయణం సాగించింది. ఇలా ఇద్దరు హౌస్ లోకి వెళ్లకముందే మరొకరితో ప్రేమలో పడ్డారు. కానీ వారిద్దరిని మరచిపోయి ఇద్దరు దగ్గరయ్యారు. ఈ క్రమంలో కొత్త సంవత్సరం వేళ అభిమానులకు షాక్ ఇస్తూ.. షణ్ముక్ బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునయన. ఐదు సంవత్సరాల అనుబంధానికి ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో ఫుల్ స్టాప్ పెట్టింది ఈ భామ. అయితే దీప్తి ప్రకటనపై తాజాగా షణ్ముక్ స్పందించాడు.

అతడు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం పై స్పందించాడు. నిర్ణయాలు తీసుకునే హక్కు దీప్తికి ఉందని. మా దారులు వేరని తెలిసిందని.. ఇక మా బంధం 5 ఏళ్ళు అందంగా గడిచిందని తెలిపాడు షణ్ముఖ్. నాకు తాను హ్యాపీగా ఉండటమే కావలి అంటూ రాసుకొచ్చాడు. ఈ ఐదేళ్లలో నీ సపోర్ట్ తో చాలా నేర్చుకున్నాను.. మంచి వ్యక్తిగా ఎదిగాను.. అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు షణ్ముఖ్. ఇక దీప్తి షణ్ముఖ్ విడిపోవడం పై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.