భారత్‌లో కొత్తగా 13,742 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,30,176..మొత్తం మృతుల సంఖ్య 1,56,567

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 13,742 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,037 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,30,176 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,567 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,26,702 మంది కోలుకున్నారు. 1,46,907 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,21,65,598 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,30,36,275 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,05,844 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/