పేలిన ట్రాన్స్‌ఫార్మ‌ర్.. 15 మంది మృతి

several-people-died-after-a-transformer-exploded-on-the-banks-of-the-alaknanda-river

చ‌మోలీ: ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలీ జిల్లాలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది మృతిచెందారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని అల‌క‌నంద న‌దీ స‌మీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్‌లో అక‌స్మాత్తుగా పేలుడు జ‌రిగింది. గాయ‌ప‌డ్డ‌వారిని జిల్లా ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్లు ఎస్పీ ప‌ర్మేంద్ర దోవ‌ల్ తెలిపారు. మృతిచెందిన ప‌ది మందిలో పీప‌ల్‌కోట్ ఔట్‌పోస్టు ఇంచార్జీ కూడా ఉన్న‌ట్లు ఉత్త‌రాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.