తెలంగాణ ఉద్యోగులను వారి రాష్ట్రానికి పంపించండి
అధికారులకు సిఏం వైఎస్ జగన్ ఆదేశం
Amaravati: ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తమ ఇబ్బందులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విన్నవించారు. తమను తెలంగాణ రాష్ట్రానికి పంపాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ వద్ద ఈ విషయాన్ని జగన్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలంగాణ నుంచి ఫైల్ ఏపీకి పంపించింది. వెంటనే ఫైల్ క్లియర్ చేసి ఉద్యోగులను తెలంగాణకు పంపాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ అంగీకరించి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/