చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఫై సజ్జల కామెంట్స్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కు కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నాల్గు వారాలపాటు బెయిల్ మంజూరు చేయడం తో బాబు మంగళవారం సాయంత్రం జైలు నుండి బయటకు వచ్చారు. చంద్రబాబు రాకతో టిడిపి శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. రాజమండ్రి జైలు వద్దకు వేలాదిగా కార్యకర్తలు హాజరై..ఆయనకు ఘన స్వాగతం పలికారు.

దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బయట చెప్పుకోవడానికి కూడా సంకోచించే చర్మ వ్యాధిని ప్రాణాంతకంగా చూపుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ మాత్రమేనని, అది కూడా కంటికి శస్త్రచికిత్స చేయించకోవడానికి మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. కానీ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా? అని విమర్శించారు.