స్కూల్ బ‌స్సును ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. ప‌లువురు పిల్ల‌ల‌కు గాయాలు

road-accident-in-rajanna-sircilla-district

ఎల్లాపెడ్డిపేటః రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. నొప్పితో ఏడ్చిన చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా తీశారు. డీఈవో రాధాకిషన్ ను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క‌రీంన‌గ‌ర్ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు, విజ్ఞాన్ స్కూల్‌కు చెందిన బ‌స్సును వెన‌క నుంచి ఢీ కొట్టింది. ఆస‌మ‌యంలో బ‌స్సులో 20మంది విద్యార్థులు ఉన్నారు.

బ‌స్సు వేగంగా ఢీ కొట్ట‌డంతో స్కూల్ బ‌స్సులోని పిల్ల‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. హాహాకారాలు చేశారు. విష‌యం తెలిసిన వెంట‌నే త‌మ పిల్ల‌ల‌కు ఏమైంద‌నే భ‌యంతో త‌ల్లిదండ్రులు, స్కూల్ యాజ‌మాన్యం సంఘ‌ట‌నా స్థ‌లానికి ప‌రుగులు తీశారు.