పంటకాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్… ఆరుగురి మృతి

శుభకార్యానికి వెళుతుండగా దుర్ఘటన

six-died-in-a-tractor-mishap-in-guntur-district

వట్టిచెరుకూరు: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు వద్ద ఓ ట్రాక్టర్ పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలిలోనే ముగ్గురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ముగ్గురు మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడు నుంచి చేబ్రోలు మండలం జూపూడికి ఓ శుభకార్యం నిమిత్తం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మరో 8 మందికి గాయాలు కాగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోగా, కొందరు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు.