రేవంత్ భూపాలపల్లి సభలో విషాదం..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం భూపాలపల్లి లో ప్రజల గొంతుకకు ప్రణామం పేరుతో భారీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. భూపాలపల్లికి చెందిన సీనియర్ నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా నిర్వహించిన ఈ సభలో ఎప్పటిలాగానే కేసీఆర్ సర్కార్ అక్రమాలపై నిప్పులు చెరిగారు. గాలి, నీటిని కూడా అమ్ముకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఇసుక దొంగ.. బొగ్గు దొంగ.. గజ దొంగ గండ్ర వెంకట రమణా రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటె ఓ విషాద ఘటన రేవంత్ తో పాటు నేతలను , కార్యకర్తలను బాధపెట్టింది.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌కి చెందిన మాజీ ఎంపీటీసీ గోలి సత్యనారాయణ రేవంత్ సభకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుండెపోటు రావడం తో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అప్పటికప్పుడు స్పందించిన కాంగ్రెస్ కార్యకర్తల తరఫున నగదు సాయం అందజేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.