రేపు రిలీజ్ అవుతుండగా.. రామారావు నుండి హైలైట్ సీన్ లీక్..

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ..రేపు (జులై 29) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో సినిమాలోని హైలైట్ సీన్ లీక్ అయ్యి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సీన్ లో మాస్ రాజా రవితేజ చెప్పిన డైలాగ్స్ అందరు మాట్లాడుకునేలా చేస్తుంది.

‘‘రేయ్‌ మీరు ఎవరో.. ఏ పార్టీయో నాకు అనవసరం… ఎవరైనా సరే.. అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం… చెరువులు పూడ్చేస్తాం… అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే (వేలు చూపుతూ)… అవుట్‌ అవుట్‌’’ అని విలన్‌లకు వార్నింగ్‌ ఇస్తున్న సీన్ ఇది. ప్రస్తుతం ఈ వీడియో ను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో రవితేజ ఒక నిజాయితీ గల పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇందులో దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా వర్క్ చేశారు.