చంద్రబాబు భార్య కాళ్లను కన్నీళ్లతో కడుగుతాం.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు భార్య భువనేశ్వరి కాళ్లను కన్నీళ్లతో కడుగుతాం అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా గౌరవ సభల పేరుతో అందరికి సోదరి సమానులైన భువనేశ్వరిని చంద్రబాబు బజారుకీడ్చడం బాధాకరమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా ఒకే గౌరవమే ఇస్తానని అన్నారు.

ఒక స్త్రీని ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నానని.. ఇక ఈ విషయానికి ముగింపు పలకాలని ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. ఒకవేళ భువనేశ్వరి అక్క కూడా తనని అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతితో కాళ్లు కడుగుతామన్నారు. ఆనాడు సత్య హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం భార్య ను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే.. ఈనాడు ఈ చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య ను బజారుకీడ్చడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రజా గౌరవ సభలపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను ఎవరు కించపరిచినా అది తప్పేనని.. వైఎస్ సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి అయినా ఒకే గౌరవం ఉంటుందన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని భువనేశ్వరి భావిస్తే తమ ఎమ్మెల్యేలమంతా కన్నీటితో భువనేశ్వరి కాళ్లు కడుగుతామన్నారు.