ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు పూర్తి

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిసాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరిపారు. శుక్రవారం గుండెపోటుతో మరణించిన పునీత్..తన పెద్ద కూతురు అమెరికా నుండి రావడం ఆలస్యం కావడం తో ఆదివారం ఉదయం అంత్యక్రియలు జరిపారు. శనివారం పునీత్ పెద్ద కూతురు వచ్చింది.

పునీత్‌ పార్థివ దేహంపై కాసేపు జాతీయ జెండాను కప్పి ఉంచి, అనంతరం ఆ పతాకాన్ని పునీత్‌ భార్యకు అందజేశారు. కంఠీరవ స్టూడియోస్‌‌లోని తండ్రి సమాధి దగ్గరే ఆయన కూడా సమాధి అయ్యారు. ఈ అంతిమయాత్రలో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎంలు యడ్యూరప్ప, సిద్దరామయ్యలతో పాటు పలువురు మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ భార్య అశ్విని, కుమార్తెలు వందిత, ధృతి, సోదరుడు శివరాజ్‌కుమార్ రోదనలు పలువురి చేత కంటతడి పెట్టించాయి.

Karnataka: The last rites of Kannada actor #PuneethRajkumar were performed at Sree Kanteerava Studios in Bengaluru today with state honours. pic.twitter.com/mzk5m9GoBR— ANI (@ANI) October 31, 2021