BRO నిర్మాత ఇంట విషాదం

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన పీపుల్స్ మీడియా అధినేత, టీజీ విశ్వప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. టీజీ విశ్వప్రసాద్ తల్లి టీజీ గీతాంజలి (70) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయినప్పటికీ కోలుకోలేని పరిస్థితులు తలెత్తాయి. దీంతో చివరి కోరిక మేరకు తనయుడు విశ్వ ప్రసాద్ ఆమెను వారణాసి తీసుకెళ్లారు. అక్కడే, దైవ దర్శనం అనంతరం నిన్న (శుక్రవారం) సాయంత్రం తుది శ్వాస విడిచారు. గీతాంజలికి ముగ్గురు పిల్లలు కాగా.. అంత్యక్రియలు వారణాసిలోనే జరుగుతాయని పెద్ద కుమారుడు విశ్వ ప్రసాద్ వెల్లడించారు.

ప్రస్తుతం టీజీ విశ్వ ప్రసాద్ వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్ర హక్కులను రూ. 180 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. మరోవైపు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమా కూడా ఇదే బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. అలాగే రవితేజతో ఇప్పటికే ‘ధమాకా’ మూవీ నిర్మించగా.. అప్‌కమింగ్ మూవీ ‘ఈగల్’ కూడా పీపుల్స్ మీడియానే నిర్మిస్తోంది. ఇలా వరుస అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.