ఈరోజు సాయంత్రం తెలంగాణ పీసీసీ నేతలతో ప్రియాంకగాంధీ భేటీ..

ఈరోజు సాయంత్రం టెన్ జన్ పథ్ లోని సోనియా గాంధీ నివాసంలో తెలంగాణ పీసీసీ నేతలతో ప్రియాంకగాంధీ భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యపేతమగు మునుగోడు ఉప ఎన్నిక వేడి మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి లో చేరారు. దీంతో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ క్రమంలో అన్ని పార్టీలు ఉప ఎన్నిక ఫై ఫోకస్ చేసాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే బిజెపి , టిఆర్ఎస్ పార్టీ లు భారీ బహిరంగ సభలు ఏర్పటు చేసి ప్రచారం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక ఫై తెలంగాణ పీసీసీ నేతలతో ప్రియాంకగాంధీ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, నాయకుల మధ్య విభేదాలపై చర్చించే అవకాశం ఉంది.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్లపై సీనియర్ నాయకుల విమర్శలపై కూడా డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర్ రాజనర్సింహ మీటింగ్ హజరుకానున్నారు.