ఇంకా విషమంగానే ఆరోగ్య పరిస్థితి
ఆర్మీ ఆసుపత్రి బులిటెన్ విడుదల
New Delhi: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి కొద్ది సేపటి కిందట బులిటెన్ విడుదల చేసింది.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో పాటు కరోనా వైరస్ సోకడంతో ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామనీ, ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా కనిపించడం లేదని ఆ బులిటెన్ పేర్కొంది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/