రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌భాస్

ల‌వ్ కుశ్ రామ్ లీలా మైదానంలో జ‌రిగిన రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మంలో రెబెల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నారు. దసరా సంద‌ర్భంగా ఢిల్లీలోని రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా ప్రభాస్ పాల్గొన్నారు. ల‌వ్ కుశ్ రామ్ లీలా మైదానంలో భారీ ఎత్తున ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ప్ర‌భాస్‌ను చూసేందుకు భారీ ఎత్తున్న అభిమానులు, జ‌నం వ‌చ్చారు. ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. రావణ సంహారంలో భాగంగా ప్రభాస్ విల్లుతో బాణాన్ని సంధించారు.

ల‌వ్ కుశ్ రామ్ లీలా క‌మిటీ అధ్య‌క్షుడు అర్జున్ కుమార్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ..భారత సంస్కృతి పట్ల హీరో ప్రభాస్ కు ఉన్న అంకిత భావం చూసే ఆయన్ని పిలిచామని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో రెండేళ్లుగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందువల్ల కమిటీ నిర్వాహకులు ఈసారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలు దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక టాలీవుడ్ క్రేజీ హీరో ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘ఆది‌పురుష్’. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ జానకిగా, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.