హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యాం – కొడాలి నాని

హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యాం అన్నారు ఏపీ మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని. దసరా పర్వదినాన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వికేంద్రీకరణ మూడు రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు, ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడి ఉన్నారని.. రాష్ట్ర సంపదంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయన్నారు. ప్రజల కష్టాన్ని ఒకే చోట పెడితే హైదరాబాద్‌ పరిస్థితే వస్తుందని.. కులాలు, పార్టీల కోసం కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే మూడు రాజధానుల నిర్ణయం అన్నారు.