ప్రధాని మోడికి సౌదీ రాజు ఫోన్

mody, mohammed bin salman

న్యూఢిల్లీ: సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ‌, ప్రధాని నరేంద్రమోడితో ‌ఫోన్ లో మాట్లాడారు. కోవిడ్19 మహమ్మారి నేపథ్యంలో, ప్రపంచ సవాళ్ళపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జి20 దేశాల బృందానికి అధ్యక్ష పదవిలో సౌదీ అరేబియా అందించిన నాయకత్వానికి ప్రధానమంత్రి ప్రశంసలు తెలిపారు. మహమ్మారికి వ్యతిరేకంగా, జి20 స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు, సమన్వయ ప్రతిస్పందనను ప్రోత్సహించడంలో సహాయపడ్డాయని ఇరువురు నాయకులు అంగీకరించారు. జి20 ఎజెండాలో ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రాధాన్యతలపై కూడా వారు చర్చించారు. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరువురు నాయకులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో సౌదీ అధికారులు ప్రవాస భారతీయులకు అందించిన సహకారానికి ప్రధానమంత్రి మోడి సౌదీ అరేబియా రాజు సల్మాన్ ‌కు కృతజ్ఞతలు తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/