లక్షద్వీప్‌లో పర్యటించిన రాష్ట్రపతి

Ramnath Kovind
Ramnath Kovind

కవరత్తి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజూ కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో పర్యటించారు. కొచ్చి నుండి బయలుదేరి కరవట్టి ప్రాంతంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రపతి కవరట్టిలోని ప్రజలను ఉద్దేశించి ఈ ఆసుపత్రి ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందుబాలోకి వస్తాయన, చికిత్స కోసం స్థానికులు కొచ్చికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రపతి బంగారం ద్వీపానికి బయలుదేరి గురువారం కొచ్చికి తిరిగి వచ్చి అదే రోజు న్యూ ఢిల్లీకి
బయలుదేరుతారు. కాగా, రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రామ్‌నాథ్ కోవింద్ మొదటిసారి లక్షద్వీప్ ను సందర్శించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/