మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు

రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ

Once again ED notices for MLC Kavitha

హైదరాబాద్‌ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఈడి పేర్కొంది. ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్ కి చెందిన బిజినెస్మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై బుధవారం అప్రూవర్ గా మారారు. ఈ మేరకు సిఆర్పిసి సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఆయన నుంచి ఈడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడి అభియోగం మోపింది.

ఈ నేపథ్యంలోనే గురువారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఈడి జారీ చేసింది. నిజానికి అరుణ్ అప్రూవర్ గా మారడం ఇది కొత్త కాదు. గతంలో ఓసారి కూడా ఇలాగే అప్రూవల్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత బలవంతంగా అప్రూవర్ గా మారేలా చేశారంటూ మాట మార్చారు. ఇప్పుడు మరోసారి అరుణ్ రామచంద్ర అప్రూవర్ గా మారారు.