భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

ఫెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యూలియర్‌లకు నోబెల్ బహుమతి

Nobel Prize in Physics awarded to Pierre Agostini, Ferenc Krausz, Anne L’Huillier

స్టాక్‌హోంః 2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ సంవత్సరానికి నోబెల్ ప్రకటించారు. ఒక పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకు గాను వీరిని నోబెల్ వరించింది.

ఈ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్నవారికి నోబెల్ ఫౌండేషన్ 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్ (986,000 డాలర్లు) అందించనుంది. 2012లో ప్రైజ్ మనీని 10 మిలియన్ క్రౌన్స్ నుంచి 8 మిలియన్ క్రౌన్స్‌కు తగ్గించారు. 2017లో తిరిగి 9 మిలియన్ క్రౌన్స్, 2020లో 10 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. ఇప్పుడు 11 మిలియన్లకు పెంచారు.