కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు…

పార్టీ ముఖ్యనేతలతో నారా భువనేశ్వరి మాటామంతి

Nara Bhuvaneshwari was talking to TDP leaders at Kuppam on Thursday night

కుప్పం: కుప్పం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం రాత్రి కుప్పంకు చేరుకున్న ఆమె నేతలతో మాట్లాడారు. మా కుటుంబంతో కంటే మీతోనే చంద్రబాబు అత్యధిక సమయం గడిపారు..మీరు ఆయనతో దగ్గరగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయనకు ఓ టీమ్ అవసరం అని చెప్పారు. కుప్పం ప్రజలు ఇక్కడి పరిస్థితులు చక్కదిద్ది చంద్రబాబును గెలిపించడానికి కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు.

7సార్లు చంద్రబాబును వరుసగా కుప్పం ప్రజలు ఆశీర్వదించారని .ఈ విషయాన్ని మా కుటుంబం ఎప్పటికీ మరచిపోదు…అని అన్నారు . కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలుతెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. చంద్రబాబు కుప్పంలో ఏ ఒక్కరినీ మర్చిపోరు…అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. అని తెలిపారు. కుప్పంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా చంద్రబాబు చూస్తారని చెబుతూ, గత ఐదేళ్లుగా కుప్పం ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారుఅని అన్నారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోని విధంగా సమస్యలు, .అక్రమ కేసులను భరించారని చెప్పారు. వైసీపీ దాష్టీకాలను తట్టుకుంటూ..ధీటుగా ఎదుర్కొంటూ పసుపు జెండాను నిలబెడుతూ వస్తున్న కుప్పం కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు… అని భువనేశ్వరి అన్నారు.


రానున్న ఎన్నికల్లో కుప్పం మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం విజయ దుందుభి మోగించాలి…. అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు, మన కార్యకర్తల కుటుంబాల కోసం నేను ‘ నిజం గెలవాలి ‘ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిచేశానని , కుప్పం కుటుంబ సభ్యుల సమక్షంలో చంద్రబాబు తరపున నామినేషన్ వేస్తానని నేను అడగడంతో చంద్రబాబు ఒప్పుకున్నారని తెలిపారు.

ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. చంద్రబాబు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కుప్పం కుటుంబ సభ్యులు కదలి రావాలని కోరుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ,. 7సార్లు చంద్రబాబును మేం గెలిపించుకున్నాం..మాకు ఆయనపై అంత నమ్మకం అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/