ఇప్పటం గ్రామంలో సభా ఏర్పాట్లను పరిశీలించిన నాగబాబు

nagababu-visit-ippatam-village

అమరావతి: 14వ తేదీన మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరుగనున్నది. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పలు కీలక ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో, ఇప్పటం గ్రామం వద్ద సభా ఏర్పాట్లను జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, సినీ నటుడు నాగబాబు పరిశీలించారు. ఆయన వెంట పలువురు జనసేన నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నాగబాబు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించి పలు సూచనలు చేశారు. కాగా, ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరిట నామకరణం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/