రేవంత్ ఫై షర్మిల ఫైర్

YSRTP అధినేత్రి వైస్ షర్మిల..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఆనాడు వైఎస్ఆర్ ఆజన్మ శత్రువు అన్నది రేవంత్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు.

వైఎస్ఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని వైఎస్ షర్మిల అన్నారు.‘పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు’ అంటూ ఆరోపించారు.

ఇక యాత్ర లో భాగంగా రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వాదం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.