సిఎం జగన్ను కలిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి
వివేకా హత్య కేసులో అవినాశ్రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ
అమరావతిః సిఎం జగన్ను కడప వైఎస్ఆర్సిపి ఎంపీ అవినాశ్ రెడ్డి కలిశారు. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో భేటీ అయ్యారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అవినాశ్రెడ్డిని సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు అవినాశ్ను విచారించిన అధికారులు.. ఇటీవల సీబీఐ కోర్టులో చార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అందులో కీలకమైన పలువురు సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జగన్తో అవినాశ్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.