స్వాతంత్య్ర భారత వజ్రోత్సవం : సత్తుపల్లిలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య..

రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్య్ర భారత వజ్రోత్సవం వేడుకల్లో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఈరోజు శనివారం సత్తుపల్లి పట్టణంలో రెండు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ తీశారు. ఈ ఆగస్టు 15తో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8నుంచి 22 వరకు ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’ నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సత్తుపల్లి పాత సెంటర్ నుండి బస్ స్టాండ్ మీదుగా JVR స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో పోలీస్ అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, పలు స్కూల్స్ విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ..స్వాంతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16న సామూహిక స్వాతంత్య్ర జాతీయ గీతాలోపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలని, ఆనాటి ఉద్యమ నేపథ్యం భావి తరాలకు అర్థం చేయించాలని కోరారు.