మరో వివాదంలో చిక్కుకున్న మంత్రి మల్లారెడ్డి ..

తెరాస మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా లో రేవంత్ vs మల్లారెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం వైరల్ కాగా..ఇది మరచిపోకముందే మరో వీడియో తో సోషల్ మీడియా లో మల్లారెడ్డి హాట్ టాపిక్ అయ్యాడు.

ఆదివారం జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పాపన్న విగ్రహాన్ని మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ..డంపింగ్ యార్డ్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘మీకు అన్ని వసతులు కల్పిస్తా.. ఇంకోటి అదృష్టం చూసినవా.. మనకే వాసన జవహర్ నగర్‌కు దిక్కులేదు ఇప్పుడు.. నవ్వుతూ.. అక్కడ దమ్మాయి గూడ దిక్కు పోయింది. అంటూ నవ్వుతూ అన్నారు. అంతలోనే అక్కడున్న మహిళలు వాసన మాకు కూడా వస్తుంది. మాకేమీ మేలు జరగలే సారూ.. అనగానే.. వస్తుంది అక్కా అంటూ మంత్రి నవ్వేశారు. ఈ వ్యాఖ్యల ఫై డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి తో పాటు కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మంత్రి గారూ.. దమ్మాయి గూడ‌కు వాసన వస్తే మీకు అదృష్టమా..? వాసన జవహర్ నగర్ నుంచి దమ్మాయి గూడ‌కు రాదు, దమ్మాయి గూడ నుంచి జవహర్ నగర్‌కు పోదు.. అది గాలి ఎటువుంటే అటే పోతుంది. ఎక్కడి ప్రజలను అక్కడ ప్రలోభాలకు గురి చేస్తూ, ఒకరిని మెచ్చుకుంటూ, ఇంకొకరిని కించపరచడం మీకు తగునా.. అంటూ మంత్రి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. మల్లారెడ్డి వెంటనే దమ్మాయిగూడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో అని తెరాస కార్యకర్తలు , నేతలు మాట్లాడుకుంటున్నారు.