రేపు తొర్రూరులో పర్యటించనున్న మంత్రి కెటిఆర్

ktr

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం తొర్రూరు పట్టణ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో కెటిఆర్ స‌మీక్షించ‌నున్నారు. ఆ తర్వాత 20 వేల మంది మహిళలతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కెటిఆర్ మాట్లాడతారు. అలాగే అదే రోజు మహిళా దినోత్సవ కానుకగా, రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు రూ. 750 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు చెక్కుల రూపంలో అందజేయ‌నున్నారు. అలాగే అభయ హస్తం డబ్బులను కెటిఆర్ డ్వాక్రా మహిళలకు

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళ దినోత్సవం రాష్ట్రమంతా ఘనంగా జరుపుకోవాలి అన్నారు. తొర్రూరులో జరిగే రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు మంత్రి కేటీఆర్ వస్తున్నారు ఈ ఉత్సవాలలో మొత్తం రూ. 750 కోట్ల నిధులను మహిళా దినోత్సవం కానుకగా మహిళల స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు అందిస్తున్నామన్నారు. రూ. 250 కోట్లు ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌హిళ‌ల కోసం కాగా, రూ. 500 కోట్లు గ్రామీణ మ‌హిళ‌ల కోస‌మ‌ని మంత్రి తెలిపారు. మహిళలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభయ హస్తం నిధులు కూడా విడుదల చేస్తున్నామన్నారు.