కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కెటిఆర్
కామారెడ్డి: మంత్రి కెటిఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన జిల్లా స్వాగత తోరణాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. దీంతోపాటు 6 లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఎల్లారెడ్డికి చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మొత్తంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.53 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి రోడ్డుపై ఉన్న జీవధాన్ సమీపంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.