నేడు నాగోల్‌ పైవంతెనను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

minister-ktr-inaugurates-nagole-flyover-in-hyderabad

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ ఈరోజు నాగోల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభించనున్నారు. 990 మీటర్ల పొడవున ఆరు లేన్లుగా నిర్మించిన ఈ టూ వే ఫ్లైఓవర్‌తో ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించడానికి అవకాశం ఏర్పడనుంది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలకు ట్రాఫిక్‌ సమస్యల నుంచి ఉపషమనం లభించనుంది.

మాదాపూర్‌, గచ్చిబౌలి, ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రెండు ఫ్లై ఓవర్లను జీహెచ్‌ఎంసీ నిర్మించింది. అందులో కొత్తగూడ ఫ్లై ఓవర్‌ ఒకటి కాగా మరొకటి శిల్పా లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. శిల్పాలేఅవుట్‌ పైవంతెనను నవంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగూడ ఫ్లై ఓవర్‌ పనులు త్వరలో పూర్తవుతాయి. డిసెంబర్‌ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.