ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. 1500 గుడిసెలు దగ్ధం

రెండు ఎకరాల్లో ఉన్న పూరిగుడిసెలు అగ్నికి ఆహుతి

fire-incidents-in-delhi

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 1500కుపైగా పూరిగుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలిసుల వివరాల ప్రకారం .. ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడ ప్రాంతంలో గత అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 1500కుపైగా పూరిగుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 28 యంత్రాలతో మంటలను అదుపు చేశారు.. మొత్తం 2 ఎకరాల్లో ఉన్న 1500 పూరిగుడిసెలు కాలి బూడిదైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టంజరగలేదు. కానీ ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/