లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 494 పాయింట్లు లాభపడి 74,742కి పెరిగింది. నిఫ్టీ 152 పాయింట్లు పుంజుకుని 22,666 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.31 వద్ద కొనసాగుతుంది.