లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 65,402కి చేరుకుంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.95 వద్ద కొనసాగుతుంది.