లాభాల్లో దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

sensex start with gains
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 486 పాయింట్లు లాభపడి 65,205కి పెరిగింది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 19,322 కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.95 వద్ద కొనసాగుతుంది.