భారీ లాభాల్లో స్టాక్‌ ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 467 పాయింట్లు లాభపడి 63,385కి చేరుకుంది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 18,826కి ఎగబాకింది.