భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 497 పాయింట్లు లాభపడి 56,319కి పెరిగింది. నిఫ్టీ 157 పాయింట్లు పుంజుకుని 16,771 వద్ద స్థిరపడింది. అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/