నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభాల జోరును కొనసాగించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈక్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 61,193కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,089 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.81 వద్ద కొనసాగుతుంది.