ఏడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఏడో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 175.58 పాయింట్లు నష్టపోయి 59,288.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.10 పాయింట్ల నష్టంతో 17,392.70 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.84గా ఉంది.