లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి : నాలుగు రోజుల మార్కెట్ల నష్టాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రానికి పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడి 55,320కి చేరుకుంది. నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 16,478కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.77వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/