మళ్లీ నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. జాతీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 130 పాయింట్లు పడిపోయి 40,732 వద్ద ప్రారంభమయింది. నిఫ్టీ సూచీ 52 పాయింట్లు నష్టపోయి 12,008 వద్ద ట్రేడవుతుంది. యుఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 70 గా కొనసాగుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/