ప్రమాదానికి గురై మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు తాను తయారు చేసిన బాంబు పేలి రవి మృతి చెందినట్లు తెలుస్తుంది. జార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రవి మృతిని మావోయిస్టులు ధృవీకరించారు. కాగా ఈ ఘటన జరిగి సంవత్సరంన్నర కావస్తుంది. కానీ తయారుచేసిన బాంబులు పేలటంతో రవి మృతి చెందాడని ఇన్నాళ్లికి కేంద్ర కమిటీ ఆలస్యంగా రవి మృతిని వెల్లడించింది.

రవి మావోయిస్టు దళంలో టెక్నికల్ టీంలో సభ్యుడు. రవికి కమ్యునికేషన్స్‌తో పాటు ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో ఎక్స్ పర్ట్. అలా బాంబులు తయారుచేసి..వాటిని పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గత ఏడాది అంటే జూన్ 5, 2020 న జార్ఖండ్‌లో రవి మృతిచెందాడు. రవి మృతి తమకు ఎంతో తీరని నష్టం అని..రవికి విప్లవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపామని మావోయిస్ట్‌ పార్టీ తెలిపింది.