20న ప్ర‌ధాని మోడీతో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ భేటి

Mamata Banerjee to meet PM Modi on December 20 for release of Central funds

కోల్‌క‌తా : కేంద్ర ప్ర‌భుత్వం త‌మ రాష్ట్రానికి రావాల్సిన‌ పెండింగ్ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని ప‌శ్చిమ బెంగాల్ కోరుతోంది. కేంద్ర నిధుల విడుద‌ల కోరుతూ ఈనెల 20న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌మావేశం కానున్నారు. ప్ర‌ధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరుతూ మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన విన‌తికి ప్ర‌ధాని కార్యాల‌యం (పీఎంఓ) సానుకూలంగా స్పందించింద‌ని అధికారులు తెలిపారు. డిసెంబ‌ర్ 20 ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీతో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీ అవుతారు.

కాగా, వివిధ ప‌ద్దుల కింద కేంద్ర ప్ర‌భుత్వం ప‌శ్చిమ బెంగాల్‌కు రూ. 1.15 ల‌క్ష‌ల కోట్ల బ‌కాయిలు ఉంద‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇటీవ‌ల వెల్ల‌డించారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో దీదీ భేటీ కానుండ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.